శాకంబరి దేవి టెంపుల్ సహరాన్ పూర్ కు 40 కి.మీ.ల దూరంలో కల శాకంబరి ప్రాంతంలో కలదు. చరిత్రలో దీని గురించి ఎక్కడా పేర్కొనలేదు కాని,దీనిని ఎంతో పురాతన టెంపుల్ గా భావిస్తారు. టెంపుల్ లోని విగ్రహాలు పురాతనమైనవి కావు. ఈ టెంపుల్ ను మరాఠాల కాలంలో నిర్మించారని చెపుతారు. మరికొందరు ఆదిశంకరుల వారు ఇక్కడ తపస్సు చేసారని కూడా చెపుతారు. ప్రతి సంవత్సరం ఇక్కడకు అధిక సంఖ్యలో భక్తులు వస్తారు.
ఈ గుడిలోని దేవత శాకంబరి దేవి మహిషాసుర మహా దైత్య అనే రాక్షసుడిని వదిన్చిందని ఆమె ఇక్కడ వుండి ప్రతి నెల చివరి లోను ఒక శాకాహార భోజనంచేసి వంద సంవత్సరాలు వుందని చెపుతారు.