పర్వతారోహణకు అనువైన ప్రదేశం కావటం వలన పర్యాటకులలో బాగా ప్రసిద్ధి చెందింది. ప్రయాణ సమయంలో యాత్రికులు, జమ్మూ కాశ్మీర్ పర్యాటక అభివృద్ధి సంస్థ (జమ్మూ కాశ్మీర్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్- జె.కె.టి.డి.సి) నుండి పర్వతారోహణ కరపత్రం తీసుకోవాలి. సానాసార్ పర్యాటకులు పద్ధతిగా నిర్వహించబడుతున్న పర్వతారోహణ మార్గాలను ఎంచుకోవచ్చు. పర్యాటకులు ఎంపిక చేసుకున్న మార్గా లను బట్టి, పర్వతారోహణకు 3 గంటల నుంచి 7 గంటల సమయం పట్టవచ్చు.
ఒకవేళ యాత్రికులు అలిసిపోయినట్టు భావిస్తే, సహాయకుడు వద్ద అందుబాటులో ఉన్న చిన్న గుర్రాలను అద్దెకు తీసుకోవచ్చు. అవసరమైన పర్వతారోహణ పరికరాలు పర్యాటక శాఖ వారి దుకాణాలు అందిస్తాయి. ఈ దుకాణాలలో పూచీ డబ్బు కట్టి పర్యాటకులు స్థానిక లేక దిగుమతి చేయబడిన పర్వతారోహణ పరికరాలు అద్దెకు తీసుకోవచ్చు. భారతదేశం వెలుపల నుండి వచ్చిన యాత్రికులు, పర్వతారోహణ పరికరాలు కోసం పూచీగా వారి పాస్ పోర్ట్ జమ చేయాలి.