బాస్పా నదీ తీరాన సాంగ్ల నుంచి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో వున్న ప్రసిద్ద గ్రామం చిత్కుల్. ఇండో-టిబెట్ సరిహద్దుకు దగ్గరగా వున్న చిట్టచివరి జనావాస కేంద్రంగా కూడా ఇది ప్రసిద్ది చెందింది. స్థానికుల చేత మాతా దేవి గా పిలువబడే చిత్కుల్ మాత గుడి ఇక్కడి ప్రధాన ఆకర్షణల్లో ఒకటి. గంగోత్రీ దేవి కోసం నిర్మించిన ఈ దేవాలయం పర్యాటకుల్లోను, స్థానికుల్లోను ప్రఖ్యాతి గాంచింది.
ప్రపంచంలోనే ఉత్తమమైనవి, ఖరీదైనవీ అయిన బంగాళా దుంపల సాగుకు కూడా ఈ గ్రామం ప్రపంచం అంతటా ప్రసిద్ది చెందింది. శీతాకాలాల్లో ఈ ప్రాంతం భారీ మంచు పాతాన్ని చవి చూస్తుంది – అందువల్ల ఇక్కడి ప్రజలు తప్పనిసరై దిగువ హిమాచల ప్రాంతానికి వెళ్తారు. ఇక్కడికి వెళ్ళేటప్పుడు ధనం, ఇంధనం రెండూ తీసుకువెళ్ళాలి – ఎందుకంటే ఇక్కడ ఏ ఏ టి ఎం లు కానీ, పెట్రోల్ బ౦కులు కానీ లేవు.