సంగ్రూర్ కి 4 కిలోమీటర్ల తూర్పున మంగ్వాల్ అనే గ్రామంలో వున్న గురుద్వారా ననకియానా సాహిబ్ ను 1886 లో జింద్ రాజు రాజా రఘ్బీర్ సింగ్ నిర్మించారు. ఇది ఇక్కడి ప్రజలకు నీటి పాఠాలు నేర్పడానికి వచ్చిన శ్రీ గురు నానక్ జీ, శ్రీ గురు హరగోబింద్ జీ ల గౌరవార్ధం నిర్మించారు.
ఈ గురుద్వారా సమీపంలో వున్న కొలనులో గురూజీ స్నానం చేసి స్థానిక పూజారులకు, గ్రామస్తులకు ధార్మిక ప్రవచనాలు చెప్పేవారు. ఇప్పుడు చుట్టూ హద్దులు కట్టి సరోవరంగా మార్చిన ఈ కొలనులో ఒక్క మునక వేయడం చాలా మంచిదని భావిస్తారు. ఈ గురుద్వారా లో ఒక దివాన్ హాలు, చాలా పాతదైన కరీర్ చెట్టు వున్నాయి. ఇక్కడ వున్న గుర్జితబార్ అనే ఆయుధం – 1724 అనే పర్షియన్ అంకెలు రాసి వున్నాయి.