సంగ్రూర్ – పాటియాలా రోడ్డు మీద భవానీ ఘర్ అనే వూళ్ళో, సంగ్రూర్ నుంచి 19 కిలోమీటర్ల తూర్పున గురుద్వారా పట్షాహీ – IX వుంది. ఇక్కడికి వచ్చే భక్తుల కోరికలు తీరుతాయని విశ్వసిస్తారు. అస్సాం రాజు శ్రీ గురు తేజ్ బహదూర్ జీ ని తన రాజ్యానికి ఆహ్వాని౦చాడని, ప్రయాణం 300 కిలోమీటర్లు పూర్తీ చేసాక తన అనుయాయులతో ఇక్కడ బస చేసారని చెప్తారు.