సంగ్రూర్ నుంచి 19 కిలోమీటర్ల దూరంలో సునాం అనే వూళ్ళో గురుద్వారా పట్షాహీ ఫేలీ వుంది. ఈ ధార్మిక భవనాన్ని సిక్కుల మొదటి గురువు శ్రీ గురు నానక్ దేవ్ జీ గౌరవార్ధ నిర్మించారు. మాల్వా ను సందర్శించేటప్పుడు గురువు గారు సర్హింద్ సెలయేరు దగ్గర బస చేయగా, ఒక అనుయాయుడు ఆయన్ను తన ఇంటికి పిలిచి, దాన్నే ఒక స్మారక భవనంగా మార్చారు.
1919 లో నిర్మించిన ఈ గురుద్వారాను 1966 లో ఆధునీకరించారు. దీంట్లో ఒక దీర్ఘ చతురస్రాకారపు హాలు, ఒక గాలరీ, ఒక వరండా, ఇటుకలు పరిచిన పెరడు, గుమ్మటం కల్గిన ఒక స్థంభం వున్నాయి. ఈ గురుద్వారా లో అన్ని కోరికలూ తీరుతాయని విశ్వసిస్తారు.