శంకూ, జమ్మూ మరియు కాశ్మీర్ లో ఉన్న కార్గిల్ కు సుమారు 42 కి. మీ. దూరంలో ఉన్నది. ఇక్కడ వాతావరణం సమశీతోష్ణ స్థితి గా ఉండటం వలన ఈ పట్టణం ప్రజలకు ఒక విహార స్థలంగా పేరు పొందింది. ఈ పట్టణం బౌల్ ఆకృతిలో ఉన్న లోయలో ఉన్నది. ప్రధాన నది సురు, నక్పోచు మరియు కార్ట్సే నదులు ఈ లోయలో ప్రవహిస్తున్నాయి.
ఇక్కడ కార్పో-ఖర్ స్తూపం ఉండటం వలన ఈ స్థలం పర్యాటకులలో ప్రాచుర్యం పొందింది. ఈ స్తూపం సయెద్ మీర్ హాషిం, ఒక ముస్లిం మతగురువు, పండితుడు అంకితం చేయబడింది. ఈయన ఒక బుద్ధిస్ట్ పాలకుడికి ఇస్లాం మత పాఠాలు భోదించటానికి నియమించబడ్డారు. 16వ శతాబ్దంలో,తి-నామ్గ్యాల్, ఈయన తన మతాన్ని ఇస్లాం మతం గా మార్చుకున్నాడు. యాత్రికులు కార్పో-ఖర్ స్తూపాన్ని దర్శించి, మతగురువుకి ప్రార్థనలు జరుపుతారు.
శంకూ చూడటానికి వెళ్ళినప్పుడు ప్రయాణికులు, ఈ పట్టణానికి సమీపంలో ఉన్న అడవులను చూడవొచ్చు. ఈ అడవిలో పర్యాటకులు దేవదారు, విల్లోవ్స్ చెట్లవంటి చాల రకాలను చూడవొచ్చు. ఈ ప్రదేశం వారాంతంలో విహార స్థలంగా బాగుంటుంది.
యాత్రికులు ప్రధాన రవాణామార్గాల ద్వారా ఈ పట్టణాన్ని చేరుకోవచ్చు. దీనికి దగ్గరలో లెహ్ విమానాశ్రయం మరియు శ్రీనగర్ విమానాశ్రం ఉన్నాయి. ఇవి జమ్మూ, ఔరంగాబాద్, డిల్లీ, బెంగళూరు మరియు పూణే వంటి పెద్ద నగరాలకు అనుసంధించబడ్డాయి. ప్రయాణికులు విమానాశ్రయం నుండి అద్దెకు టాక్సీలు కాని, బస్సులు కాని తీసుకుని శంకూ చేరుకోవొచ్చు.
ఎవరైతే రైల్ ద్వారా వస్తారో, వారు దగ్గరలో ఉన్నజమ్మూ తావి రైల్వే స్టేషన్ వరకు రావచ్చు. ఈ రైల్వే స్టేషన్ న్యూ డిల్లీ,బెంగుళూరు,త్రివేండ్రం మరియు చెన్నై వంటి పెద్ద నగరాలకు జత చేయబడి ఉన్నది. లెహ్, కార్గిల్ మరియు సురు వాలిలో కొన్ని ప్రాంతాలనుండి రోజుక్రమంగా బస్సులు నడుపుతున్నారు.
శంకూ ప్రాంతం సంవత్సరమంతా ఏ వాతావరణమైనా, అధికంగా ఉంటుంది. వేసవికాలం వేడిగా మరియు శీతాకాలాలు గడ్డ కట్టేంత చలిగా, చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, ఏప్రిల్ మరియు సెప్టెంబర్ మధ్యలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది, ఆ సమయంలో ఈ పట్టణాన్ని చూడవొచ్చు.