సరహన్ లో ని భీమ కాళీ ఆలయ సమీపం లో ఉన్న బర్డ్ పార్క్ పక్షి ప్రేమికులకు ఈ ప్రాంతం లో ఉన్న ప్రధాన పర్యాటక మజిలీ. నెమళ్ళ సంతానోత్పత్తి కేంద్రం గానే కాకుండా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర పక్షి అయిన మోనాల్ కి ఈ బర్డ్ పార్క్ స్థావరం. పోచింగ్ అనే పద్దతి వల్ల ప్రస్తుతం ఈ జాతులు ముప్పులో ఉన్నాయి. ముఖ్యంగా అద్భుతమైన ఈకలు కలిగిన మగ మోనాల్ పక్షి కి ఈ ముప్పు ఎక్కువగా ఉంది. దీని ఈకల్ని హిమాచల్ ప్రదేశ్ లో ని పురుషులు టోపీ లకి ఆభరణాలుగా ధరించేవారు. ఈ రాష్ట్రం లో 1982 లో వేట నిషేదించబడింది.