సముద్ర మట్టం నుండి 5155 మీటర్ల ఎత్తులో ఉన్న శ్రీఖండ్ మహాదేవ, హిందువుల యొక్క ప్రసిద్దమైన పుణ్యక్షేత్రం. మహా శివుడు ఇందులో కొలువై ఉన్నాడు. శివుడు ఈ పర్వతం వద్ద ధ్యానం చేసాడని పురాణాలు చెబుతున్నాయి. గొప్పదైన భారతీయ ఇతిహాసం అయిన మహాభారతంలో పాండవులు ఈ ప్రాంతానికి విచ్చేశారని చెప్పబడింది. ఈ పర్వతం వద్ద ఉన్న శివలింగం లో అధ్బుతాలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. ఏడాది పొడవునా ఈ ప్రాంతం లో మంచు కురిసినా ఈ శివలింగం పైన మాత్రం కురిసిన వెంటనే మంచు కరిగి పోతుందని వారు చెబుతున్నారు. అధ్బుతమైన పుష్పాలతో సందర్శకులని ఆకర్షిస్తున్న గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ లో భాగం శ్రీఖండ్ మహాదేవ.