రాజస్థాన్ లోని సరిస్క నేషనల్ రిజర్వు లోపల వున్న క౦కవారి కోట గొప్ప చారిత్రిక ప్రాధాన్యతను కల్గి ఉంది. ప్రస్తుతం శిధిలావస్థలో వున్న ఈ కోటను ఒకప్పుడు ఔరంగజేబు చక్రవర్తి, తన అన్నయ్య యువరాజు దార షికొహ్ ను నిర్భందించడానికి ఉపయోగించాడు. ఈ కోట కొండ పైన ఉండటం వలన ఇక్కడినుండి టైగర్ రిజర్వు పరిసర ప్రదేశాలను చూడవచ్చు.