చమత్కార్జి జైన దేవాలయం చమత్కార్జి జైన దేవాలయం సవాయి మాధో పూర్ లోని ఒక ప్రముఖ ధార్మిక చారిత్రిక ఆకర్షణ. ఇది రైల్వే స్టేషన్ కు వెళ్ళే ప్రధాన రహదారి పై ఉంది. శ్రీ అదినాథ్ భగవాన్ కు చెందిన ఈ దేవాలయం 400 సంవత్సరాల కిందటిదిగా భావించ బడుతుంది.
ఇతిహాసాల ప్రకారం అనేక అద్భుతమైన శక్తులు కల్గిఉన్నందున ఈ దేవాలయాన్ని చమత్కారి దేవాలయం అంటారు. ఇక్కడి దేవత ను పూజించడానికి సంవత్సరం పొడవున జైన భక్తులు వస్తుంటారు. ఇక్కడ ప్రతి సంవత్సరం శారద పూర్ణిమ నాడు ఉత్సవం జరుగుతుంది. ఆ సమయంలో అనేక మంది భక్తులు ఈ దేవాలయానికి వస్తారు. చమత్కార్జి జైన దేవాలయ ప్రాంతంలోని అద్భుతమైన అతీంద్రియ వాతావరణాన్ని అనుభవించడానికి అనేక మంది పర్యాటకులు ఆకర్షితులై ఇక్కడకు వస్తారు.