రాజస్థాన్ లోని ఝుంఝును జిల్లలో షేఖావతి ప్రాంతం మధ్యలో వున్న పట్టణం మాండ్వా. జైపూర్ కి ఉత్తరంగా 168 కి.మీ దూరంలో వున్న ఈ కోటల నగరం మా౦డ్వా ఈ ప్రాంతం లోని ఇతర పట్టణాలకు రోడ్డు ద్వారా అనుసంధానించ బడి వుంది. ఇక్కడి కోటలకు, రాజప్రాసాదాలకు మాండ్వా ప్రసిద్ది పొందింది.మా౦డ్వా క్యాజిల్ గా పిలువబడే మాండ్వా కోట 18వ శతాబ్దంలో కృష్ణుడు, అతని ఆవుల చిత్రాలతో అలంకరించిన రంగుల ప్రవేశ ద్వారం తో నిర్మించిన పెద్ద కోట. ఈ కోటను విక్రమ శకం 1812లో (క్రీ.శ1755) శార్దూల్ సింగ్ కుమారుడు ఠాకూర్ నవల్ సింగ్ నిర్మించాడు.
మధ్య యుగపు నేపధ్యంతో నిర్మించిన ఈ కోటను అందమైన కుడ్య చిత్రాలతో అలంకరించారు. కృష్ణుడి చిత్రాలు, అందమైన చేక్కుళ్ళు, అద్భుతమైన అద్దాల పనితనం ఈ కోట గదుల్లో ప్రాధమికంగా కనిపించే లక్షణాలు. అనేక పురాతన వస్తువులు, చిత్రాలు ఈ కోట లోని సభా భవనాల అందాన్ని ఇనుమడింప చేస్తాయి.ఇప్పుడు వారసత్వ హోటల్ గా మార్చివేయబడ్డ ఈ మా౦డ్వా కోటను మాండ్వా రాజకుటు౦బీకులే నిర్వహిస్తున్నారు. స్టాండర్డ్, డీలక్స్, లక్జరీ స్వూట్, రాయల్ స్వూట్ విభాగాల్లో మొత్తం 70 గదులు ఈ కోటలో వున్నాయి.
ఇక్కడి బహుళ వంటకాల హోటల్లో స్థానిక రుచులతో పాటు అన్ని రకాల రుచికరమైన వంటలూ దొరుకుతాయి. 24 గంటల రూమ్ సర్వీసు, ట్రావెల్ డెస్క్, విదేశీ మారకం, ఈత కొలను (ఎడారి విహార కేంద్రం నుంచి 3 కి.మీ దూరంలో), సాంస్కృతిక ప్రదర్శన, థీమ్ భోజనం, గుర్రపు స్వారీ, ఒంటెల సవారీ, గ్రామ పర్యటన లాంటి ఇతర సేవలు కూడా ఇక్కడ అందుబాటులో వున్నాయి.