రాజస్థాన్ లోని ఝుంఝును జిల్లాలోని షేఖావతి ప్రాంతం మధ్యలో వున్న చిన్న పట్టణం డుండ్ లార్డ్. ఇక్కడి వివిధ భవంతులు, ప్రాసాదాలకు ఈ పట్టణం ప్రసిద్ది పొందింది. 16వ శతాబ్దంలో రావల్ మహారాజు నిర్మించిన డుండ్ లార్డ్ కోట ఈ ప్రాంతం లోని ప్రధాన ఆకర్షణల్లో ఒకటి. ఈ కోట ను ఇప్పుడు వారసత్వ హోటల్ గా మార్చారు.జగతియా, గోయెంకా హవేలీ, సత్యనారాయణ దేవాలయం, చోఖానీ, దివానీ కా ఖాస్, లడియా, సరాఫ్ హవేలీ ఈ పట్టణం లోని ఇతర ప్రధాన ఆకర్షణలు.