షెఖావతి ప్రాంతం లో 18వ శతాబ్ద౦ లో ఠాకూర్ నవల్ సింగ్ స్థాపించిన చిన్న పట్టణం నవల ఘర్. షేఖావతి లోని నవల ఘర్, మాండ్వా లను ఆయన అప్పట్లో పాలించే వాడు. 1836 లో నవల్ ఘర్ లో నిర్మించిన ప్రాసాదాలు బాగా అందంగా చిత్రించిన కుడ్య చిత్రాలతో అలంకరించబడి వుంటాయి.
1920 లో నిర్మించిన ఆనందీ లాల్ పొద్దార్ ప్రాసాదం ఈ పట్టణం లోని అత్యంత ప్రసిద్ధ ఆకర్షణల్లో ఒకటి. ఇక్కడి బాల కిలా కోట గోడలపై స్థానిక జానపద గాథలను వర్ణిస్తూ వేసి వున్న గోడలు కూడా ప్రధాన పర్యాటక ఆకర్షణల్లో ఒకటి.జోద్ రాజ్ పతోడియా హవేలీ, బన్సీధర్ భగత్ హవేలీ, చోఖానీ హవేలీ, రూప నివాస్ ప్రాసాదం, గంగా మాయి దేవాలయం, బ్రిటిష్ గడియార స్థంభం ఇక్కడి ఇతర ప్రధాన పర్యాటక ప్రదేశాలు.