ఏనుగు జలపాతం నగరం యొక్క నడిబొడ్డు నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న అత్యంత ప్రసిద్ధి చెందిన దర్శనీయ ప్రదేశాలలో ఒకటి. మేఘాలయ రాష్ట్రంలో షిల్లాంగ్ నగరం నుండి అత్యంత సుందరమైన కొన్ని రహదారుల ద్వారా చేరుకోవచ్చు. స్థానికంగా ఈ జలపాతంను 'కా క్షిడ్ లై పటేంగ్ ఖొహ్సిఎవ్ ' అని అంటారు. ఈ జలపాతంలో నీరు మూడు దశలలో వస్తుంది. ఏనుగు పోలిన రాక్ గాఉండుటవల్ల బ్రిటిష్ వారు ఏనుగు జలపాతం అని పేరు పెట్టారు. రాక్ యొక్క భాగము 1897 లో ఆ ప్రాంతంలో సంభవించిన గొప్ప భూకంపంనకు నాశనమైంది. ఆ జలపాతం నలుపు శిలలపై పాల మాదిరిగా తెల్లగా ఉండే నీరుగా ప్రవహిస్తుంది.
ఏనుగు జలపాతం కూడా ఈ ప్రాంతానికి ప్రత్యేకమైన కొన్ని మొక్కల వివిధ జాతులు మరియు జీవవైవిధ్యానికి అనుకూలమైన ప్రాంతంగా ఉంది. రాష్ట్రంలో ఈ ప్రాంతంలో సున్నితమైన హస్తకళాకృతులను కొన్ని విక్రయించే మహిళలు నడిపే అనేక స్థానిక దుకాణాలు ఉన్నాయి. ఇక్కడ మీరు స్థానిక వస్త్రధారణతో ఫోటోలు తీసుకోవచ్చు. జలపాతం చుట్టూ ఉన్ననిటారుగా ఉన్న రాళ్ళపై అధిరోహణ చేసే ఆసక్తి ఉన్న వాళ్ళకి గొప్ప ప్రదేశముగా ఉన్నది.