షిల్లాంగ్ పర్యటనలో తప్పనిసరిగా లేడీ హైదరి పార్క్ ను సందర్సించాలి. ఒక పచ్చని తోటలో ఏడాది పొడవునా రంగులతో కూడిన పుష్పాలు పూస్తాయి. ఒక ప్రత్యేక జింక పార్క్ తో మినీ జూ ఉంటుంది. లేడీ హైదరి పార్క్ లో వినోదం మరియు క్రీడ కోసం ఒక స్థలం ఉంది. పర్యాటకులు మరియు స్థానికులు ,పిల్లలు,పెద్దలు బహిరంగ ప్రదేశంలో కృత్రిమ గడ్డి లో కూర్చుని ఉన్నప్పుడు ప్రకృతిని ఆస్వాదించవచ్చు. అలా కొన్ని గంటలు కుర్చుని ఆనందిస్తే మనకు సమయమే తెలియదు.
షిల్లాంగ్ బ్రిటీష్ పాలనలో ఉన్నప్పుడు అస్సాం గవర్నర్ భార్య మరియు అస్సాం రాష్ట్రంలో మొదటి మహిళ అయిన లేడీ హైదరి ప్రకృతి మీద ప్రేమతో ఈ పార్క్ కు వచ్చెను. ఈ పార్క్ జపనీస్ శైలిలో ప్రకృతి సిద్దంగా పుష్పం పడకలు మరియు మినీ జూ ఉన్నది. చిన్న జంతు ప్రదర్శనశాలలో జింకల నివాసమే కాకుండా అనేక జాతుల పక్షులు,సరీసృపాలు మరియు క్షీరదాలు ఉన్నాయి. లేడీ హైదరి పార్క్ అటవీ శాఖ ద్వారా నిర్వహించబడుతుంది. పార్క్ యొక్క ఒక ప్రత్యేక ఆకర్షణ ఏమిటంటే వివిధ రకాల వికసించే గులాబీల పడకలు ఉంటాయి. పార్క్ దగ్గరగా నగరంలో మాత్రమే పబ్లిక్ స్విమ్మింగ్ పూల్, క్రినోలినే స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి.