మనోర్ విల్లె మేన్షన్ ఒక వారసత్వ భవనం హిమాచల్ ప్రదేశ్ యూనివర్సిటీకి సమీపంలో వుంటుంది. ఈ బిల్డింగ్ లో 1945 లో ఇండియా స్వతంత్రం గురించి మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రు, సర్దార్ పటేల్ , మౌలానా ఆజాద్ లు లార్డ్ వేవెల్ తో చర్చించారు. మహాత్మా గాంధి నివసించిన గది ఇప్పటికి పరి రక్షించారు. గతంలో ఈ ఆస్థి ఇండియా కేబినేట్ మెంబర్ అయిన రాజ్ కుమారి అమ్రిత్ కౌర్ కు చెందినది. ఇపుడు ఇది ఒక గెస్ట్ హౌస్ గా మార్పు చేసారు.