సిమ్లా టౌన్ కు తూర్పున వుడ్ విల్లా ఒక పురాతన భవనం. బ్రిటిష్ ఆర్మీ కమాండర్ ఇన్ చీఫ్ సర్ విలియం రోజ్ మానస్ ఫీల్డ్, మొదటగా దీనిలో వుండేవారు. ఈ భవనం ఎన్నో చేతులు మారి 1919 నాటికి అలయన్సు బ్యాంకుకు చేరింది. 1926 లో దీనిని గుజరాత్ రాజు భగవత్ సింగ్ కొనుగోలు చేసి తన కుమార్తె రాణి లీలా బాయికి 1930 లో బహుకరించాడు. పురాతన భవనాన్ని 1938 లో జుబ్బార్ రాజ వంశీకులు పడగొట్టి నూతన భవనాన్ని నిర్మించారు. బిల్డింగ్ లో కొంత భాగాన్ని రాజకుమారుడు అయిన ఉదయ సింగ్ 1977 లో ఒక హెరిటేజ్ హోటల్ గా మార్చాడు.