షిమోగా జిల్లా చారిత్రాత్మకంగా కూడా ప్రసిద్ధి చెందింది. ఎన్నో చారిత్రక అంశాలు కూడా కనపడతాయి. వాటిలో శివప్ప నాయిక పేలస్ మరియు మ్యూజియం ఒకటి. దీని చరిత్ర 16వ శతాబ్దానికి చెందినది. ఈ పేలస్ ను పూర్తిగా రోజ్ వుడ్ తో కేలాడి రాజు శివప్ప నాయక నిర్మించాడు. ఇపుడు ఈ పేలస్ ను పురావస్తు శాఖ సంరక్షిస్తోంది. కేలాడి రాజ్య చరిత్ర, వారసత్వం వంటివి ఈ బిల్డింగ్ లోని మ్యూజియంలో ప్రదర్శించబడ్డాయి. తుంగ నది ఒడ్డున ఈ పేలస్ ఉంది. ఈ పేలస్ షిమోగా నగర నడిబొడ్డున ఉంది. రవాణా సదుపాయం తేలిక. లోకల్ బస్ లు కూడా ఉన్నాయి. టాక్సీలు, రిక్షాలలో కూడా నిమిషాలలో చేరవచ్చు.