సాయి బాబా జీవితంలో చావడి చాల ముఖ్యమైన స్థలం. శిర్దిలోని ఈ ప్రదేశంలో తన జీవిత చరమాంకం లోని ఎక్కువ భాగాన్ని ఆయన గడిపారు. ద్వారకామాయి నుంచి చావడి కి ఆయనను ఊరేగింపుగా తీసుకు వెళ్ళేవారు.అదే దారిలో ఊరేగింపు తీసుకు వెళ్ళే ఆచారం ఈనాటికీ ప్రతీ గురువారం పాటిస్తారు. చావడి మళ్ళీ రెండు భాగాలుగా విభజించారు. ఒక దాంట్లో బాబాది పెద్ద చిత్రపటం వుంది. బాబా వాడిన చెక్క మంచం, తెల్ల కుర్చీ కూడా ఇక్కడ వున్నాయి.