షిర్డీ – మన్మాడ్ రాష్ట్ర రహదారిపై అందంగా అలంకరించ బడిన లెండి వనం వుంది. సాయి బాబా ఈ వనంలో చాలా సేపు గడిపారని చెప్తారు.లెండి వనం నుంచి ఒక బండ రాయిని తెచ్చి షిర్డీ వాసులు అంతా బట్టలు ఉతుక్కునే వారని జానపదులు చెప్తారు. ఐతే, బాబా దీని మీద కూర్చోవడం చూసి దాని ద్వారకామాయి కి తెచ్చి వుంచి పవిత్రంగా భావించారు.లెండి వనంలో నిరంతరం వెలిగే అఖండ దీపాన్ని చూడడం మర్చిపోకండి. బాబానే నాటిన మర్రి చెట్టు క్రింద ఇది వెలుగుతూ వుంటుంది. ఈ వనం 24 గంటలూ యాత్రికుల కోసం తెరిచే వుంటుంది.