పర్యాటకుల సందర్శనకు ముధోడి వైల్డ్ లైఫ్ శాంక్చువరి తప్పక సిఫార్సు చేయాలి. ఇది భద్ర వైల్డ్ లైఫ్ శాంక్చువరి లో ప్రధాన భాగంగా ఉంటుంది. 1998 లో ప్రాజెక్ట్ టైగర్ క్రింద ఈ శాంక్చువరీని భారతదేశంలో 25వ టైగర్ రిజర్వ్ గా ప్రకటించారు. ఈ టైగర్ రిజర్వ్ లో వివిధ రకాల జంతువులు, పక్షులు కనపడతాయి. పులి, గద్ద, చిరుత, గుంటనక్క వంటివి తరచుగా కనపడతాయి.
వీటితో పాటు, అడవి కుక్కలు, ఏనుగులు, కోతులు, చిరుతపులులు, గుడ్లగూబలు, వివిధ పక్షులు కూడా కన్నులకింపుగా చూడబడతాయి. ఈ శాంక్చువరీ లో షుమారు 120 రకాల వృక్షజాతులు సంరక్సించబడుతున్నాయి. ఎన్నో పక్షులకు, సంతువులకు ఈ వనం ఆశ్రయంగాను, ఆహారం అందించేదిగాను ఉంది.