మొఘల్ పరిపాలకుల యొక్క వేట ప్రాంతంగా దట్టమైన అడవులు కలిగిన ఈ శివపురి వ్యవహరించేది. శివపురిని పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చెయ్యడం లో ఈ దట్టమైన అడవులు తమదైన పాత్ర ని పోషిస్తున్నాయి. కరేరా బర్డ్ సాంచురీ ఇంకా మాధవ్ నేషనల్ పార్క్ ల తో పాటు అపారమైన కోటలను ఈ ప్రాంతం లో గమనించవచ్చు. ప్రకృతి తో మానవుడు సహజీవనం చేసే ప్రాంతం గా దీనిని అభివర్ణించవచ్చు.
శివపురి - ప్రకృతి మాత రాజ్యం
ఘనమైన జీవన వైవిధ్యం కలిగిన సుందరమైన ప్రాంతం ఈ మాధవ్ నేషనల్ పార్క్. అందమైన సరస్సు, అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు ఇంకా కొండలు ఈ ప్రాంతానికి వన్నె తెస్తున్నాయి. నేషనల్ పార్క్, సఖ్య సాగర్ లేక్, భూర ఖాన్ జలపాతం, పావా జలపాతం మరియు సన్ చైరైయ బర్డ్ సాంచురీ లు అన్నీ ప్రకృతి ఒడిలో మానవుడు సేద దీరడానికి అనువుగా ఉన్న ప్రాంతాలు అని వర్ణించడం లో అతిశయోక్తి లేదు. శివపురి పర్యాటకం రోజు వారి గజిబిజి జీవన విధానం నుండి ఉపశమనం పొంది ప్రకృతి మాత ఒడిలో సేద దీరెందుకు చక్కటి అవకాశం.
శివపురి లో ఇంకా చుట్టు పక్కల పర్యాటక ఆకర్షణలు
శివపురి సుదీర్ఘమైన రంగు రంగుల చరిత్ర కలిగినది. ఇది రాజ కుటుంబానికి వేసవి రాజధాని అని చెప్పకనే చెబుతుంది. కోటలు, పాలసు లు మరియు నర్వార్ ఫోర్ట్, మాధవ్ విలాస్ పాలసు ఇంకా మహా శివ టెంపుల్ శివపురి లో ఉన్న ప్రధాన ఆకర్షణలలో కొన్ని. శివపురి లో ని పర్యాటకం ఇక్కడున్న వైభవోపేతమైన స్మారక చిహ్నాలు, నేషనల్ పార్క్లులు ఇంకా బర్డ్ సాంచురీల వల్ల దినదినాభివృద్ది చెందుతోంది.
శివపురి సందర్శన
వాయు, రైలు మరియు రోడ్డు మార్గాల ద్వారా శివపురి మిగతా ప్రాంతాలకు చక్కగా అనుసంధానమై ఉంది. ఈ ప్రాంతం లో వాతావరణం ఆహ్లాదకరం గా ఉన్నప్పటికీ అక్టోబర్ నుండి మార్చ్ వరకు సందర్శనకు ఉత్తమ సమయం.