శివపురి లో ని ప్రతి మలుపులో ని దేవుళ్ళే దిగి నిల్చున్నారా అనిపించేటట్టు ఆలయాలు కనిపిస్తాయి.శివపురి లో ఉన్న పురాతన ఆలయం బంగంగా. హిందువులకు పవిత్రమైన పుణ్య క్షేత్రం ఇది. పురాతనమైన బంగంగా ఆలయం చుట్టు పక్కల 52 పవిత్ర కొలనులు ఉన్నాయి.
భీష్ముడి దాహాన్ని తీర్చడానికి సవ్యసాచి అర్జునుడు బాణాన్ని విదిల్చాడని ఆ ప్రదేశం లో నుండే నీళ్ళు పుట్టాయని అంటారు. మహాభారతం లో ఈ ఘట్టాన్ని వివరంగా పేర్కొంటారు. భూమి పై అర్జునుడు బాణం సంధించగానే భూమి లో నుండి గంగా దేవి నేరుగా భీష్ముడి నోటి లో కి వెళ్లి అతని దాహాన్ని తీర్చిందని అంటారు.