సుదీర్ఘమైన భారత దేశ స్వాతంత్ర్య సమరానికి గుర్తుగా నిర్మించబడినది తాత్యా తోపే మెమోరియల్. స్వార్ధ రహిత అమరవీరుల రక్తం తో భారత దేశపు కలోనియల్ చరిత్ర ముడి పడి ఉంది. 1857 లో భారత మరాఠా నాయకుడు తాత్యా తోపే గా ప్రసిద్ది చెందిన రామచంద్ర పాండురంగ తోపే ధైర్యవంతుడైన స్వాతంత్ర్య సమర యోధుడు.
తన తండ్రికి అర్హత ప్రకారం రావలసిన పింఛను అందని కారణంగా కలోనియల్ పాలకులకు విరుద్ధంగా తాత్యా తోపే పోరాడారు. తనకి ఎదురైనా దేబ్బలను నాయకుడిగా ఎదుర్కొని గ్వాలియర్ ని తిరిగి స్వాధీన పరచుకోవడానికి తాత్యా ముఖ్య పాత్ర పోషించారు. భారత స్వాతంత్ర్య సమరం లో తన ప్రాణాన్ని విడిచారు.
ఇంగ్లీష్ కలోనియల్ పాలకుల నుండి గ్వాలియర్ ని చేజిక్కించుకోవడానికి ఝాన్సీ రాణీ లక్ష్మీబాయి కి తాత్యా తోపే సహకారం అందించారని అంటారు. తాత్యా తోపేకి నమ్మకస్తుడైన స్నేహితుడు నర్వార్ మాన్ సింగ్ అనే రాజు తోపే కి నమ్మకద్రోహం చేసాడు. దాని ఫలితంగా, తోపే కి శివపురి లో ఏప్రిల్ 18, 1859 న మరణశిక్ష విధించారు. ధైర్యవంతుడైన సైనికుడిగా యోలా మరియు శివపురి లో ఉన్న స్మారక చిహ్నాల ద్వారా తాత్యా తోపే చిరకాలం గుర్తుండి పోతారు.