తలా తల ఘర్ శిబ సాగర్ టవున్ కు 4 కి. మీ.ల దూరంలో కలదు. ఇది అహోం పాలకుల పాలస్. దీని శిల్ప శైలి అద్భుతం గా వుంటుంది. అహోం స్మారకాలు అన్నింటి లోకి ఇది అతి పెద్దది. ఈ పాలస్ ను అహోం రాజు స్వర్గ దేవ్ రుద్రా సింఘా తన రాజధాని గర్ఘవో నుండి రాంగ్ పూర్ (ప్రస్తుత శిబ సాగర్) కు మార్చినపుడు నిర్మించాడు.
దీని నిర్మాణం 1698 లో మొదలై, కేపిటల్ మార్చినపుడు 1702 లో పూర్తి అయింది. ఏడు అంతస్తుల ఈ నిర్మాణం లో గ్రౌండ్ లోపల కల మూడు అంతస్తులు రాజు, అతని పనివారలకు స్టోరేజ్ సౌకర్యంగా ఉండేవి. స్వర్గ దేవ్ రుద్రా తర్వాత వచ్చిన పాలకులు కూడా ఈ పాలస్ నిర్మించారు. అస్సాంలో ఈ ఆకర్షణ చాలా ప్రసిద్ధి. ఇది అహోం పాలకుల గత వైభవాన్ని చాటు తుంది. పాలస్ యొక్క ఫిరంగులు, మెట్లు, టెర్రస్ వంటివి టూరిస్టులను ఆకర్షిస్తాయి.