కచారి రాజుల మధ్య యుగపు రాజధాని ఈ ఖాస్పూర్. ఎంతో వైభవం కలిగిన ఈ ప్రాంతం ప్రస్తుతం శిధిలావస్తలో ఉంది. ఈ శిధిలాలు అప్పటి వైభవాన్ని గుర్తుకు తెస్తూనే ఉంటాయి. ఈ ప్రదేశం లో ని ముఖ్య ఆకర్షణ కచారి ఫోర్ట్. కచారి వంశస్తుల పాలన ఈ కోట నుండే జరిగింది. ఈ కోట లో పాలసు తో పాటు సూర్య ద్వారం మరియు ఒక దేవాలయం ఉన్నది.
18 వ శతాబ్దం మధ్యలో కొచ్ కింగ్ పాలనలో నుండి దిమసా కచారి పాలనలోకి ఖాస్పూర్ వచ్చింది. కొచ్ కింగ్ కి వారసులు లేని కారణంగా ఈ మార్పు జరిగింది. దిమసా కచారి రాజుల పాలనలో ఖాస్పూర్ ను రాజధానిగా మార్చి కచారి ఫోర్ట్ ని నిర్మించారు. టాక్సీ లో ఈ ప్రదేశానికి పర్యాటకులు చేరుకోవచ్చు.