శీర్కాళి, తమిళనాడు లోని నాగపట్టణం జిల్లాలో బంగాళాఖాతానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రసిద్ధ హిందూ ధార్మిక ప్రాంతం. చారిత్రిక గతాన్ని కల్గిన ఒక ప్రశాంత దక్షిణ భారత పట్టణం శీర్కాళి, ప్రస్తుత ఆధునిక కాలంలో పర్యాటక రంగం, ఆర్ధిక వ్యవస్థను అభివృద్ధి పై దృష్టిని సారిస్తూనే ఒక సంప్రదాయ దక్షిణ భారత గ్రామంలో ఉండే విశ్వాసాలను, ఆచారాలను కాపాడుతుంది. పురాణాలు, ఇతిహాసాలను అనుసరించి బ్రహ్మ దేవుడు పూర్తి గ్రహాన్నే తుడిచి పెట్టుకుపోయే విధ్వంసక వరదలనుండి 64 మందిని కాపాడిన శివుడిని ప్రార్ధించిన గ్రామం ఇదే (అందువలననే, బ్రహ్మపురీస్వరార్ అనే పేరు), ఈ కారణంగానే ఈ గ్రామంలో వివిధ రూపాలలో శివుని ఆరాధిస్తారు, అన్ని ప్రదేశాలలో ఆయన వివిధ రూపాల ఆలయాలు ఉన్నాయి.
శివుడు శీర్కాళిని కాపాడటానికి తెప్ప లేదా పడవను వాడటం వలన దీనిని తోనిఅప్పర్ లేదా తోనిపురం అంటారు; ‘తోని’ అంటే తమిళంలో పడవ అని అర్ధం., తమిళనాడు నుండే కాక దేశ౦ నలుమూలల నుండి వేలాదిమంది భక్తులు సందర్శించే ఒక ముఖ్య తీర్థయాత్రా ప్రదేశం శీర్కాళి. జనవరిలో మూడు రోజుల పాటు మకర పొంగల్ అనే మూడు రోజుల ఉత్సవం జరుగుతుంది. శివునికి చెందిన అనేక ఆలయాలు ఉన్న పట్టణమైనందున భారీ సంఖ్యలో తీర్థయాత్రికులు మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఫిబ్రవరి లో శివుని పూజించడానికి వస్తారు.
దీపావళి సందర్భంగా అక్టోబర్/నవంబర్ లలో ఈ పట్టణం దీపాల వెలుగుతో అత్యంత సంతోషంగా ఉత్సవాలు జరుపుకుంటుంది. ఈ ప్రదేశం మంచి రవాణా సౌకర్యాలతో పాటుగా వేసవిలో తేమతోకూడిన వాతావరణాన్ని కల్గి ఉంటుంది.