పెరుమాళ్ కళీసిరామ విన్నగరాం, నాగపట్టణం జిల్లాలోని శీర్కాళిలో ఉన్న హిందూ ఆలయం. ఈ ఆలయం నారాయణ లేదా విష్ణువుకు చెందింది. ఈ ఆలయాన్ని 12 మంది “ఆళ్వారులు” (కవి సాధువులు) నిర్వహించే “దివ్య దేశం” విష్ణు ఆలయాలలో కలిపారు. ఇది శీర్కాళి స్టేషన్ నుండి సుమారు అర మైలు దూరంలో ఉంది. విష్ణువు వామన అవతార౦ ఉన్న మండపాన్ని ప్రధాన గర్భగుడిగా స్థాపించారు.
దేవుడు ఇక్కడ కుడి చేతితో దానాన్ని స్వీకరిస్తునట్లుగా, చెక్క గొడుగును ఎడమ చేతితో పట్టుకొని సాలగ్రామ దండను మెడ చుట్టూ వేసుకొని దర్శనమిస్తాడు. దగ్గరలో తిరుమంగై అళ్వార్ పాదాలకు కడియాలతో ఉంటాడు. వాస్తు పూజ చేసే వారు తమ భూమి నుండి ఇసుకను తెచ్చి సాధువు పాదాల దగ్గర ఉంచి అదృష్టం, విజయం కోసం ప్రార్ధిస్తారు. ఈ ప్రాకారం లోపల మనం రాముని గుడిని కూడా చూడవచ్చు, శ్రీ ఆంజనేయుని మరొక ఆలయం కూడా ఈ ఆలయం బయట వైపున ఉంది.