తారా బాబా కుటియ నిజానికి ఒక పెద్ద, అందమైన ఆలయ ప్రాంగణం. ఇది శ్రీ తారా బాబా గౌరవానికి గుర్తుగా నిర్మించబడింది, ఇది సర్సా లోని ప్రధాన నగరం నుండి షుమారు 7 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఈ కుటియలో ఆలయాలు, నీటి నిర్మాణం, త్రిశూలం చిహ్నంతో ఎత్తైన శివుని విగ్రహం ఉన్నాయి. ఈ ఆలయాలు దట్టమైన భూముల, రాత్రిపూట వెలిగే అందమైన కాంతుల అందమైన పచ్చిక బయళ్ళ మధ్య ఉన్నాయి. ఈ ఆలయ ప్రాంగణ స్థాపకుడు తారా బాబా 2003 జులై లో మరణించారు.
ఈ కుటియ లో కృష్ణ జన్మాష్టమి, నవరాత్రి, దీవాలి, మహా శివరాత్రి ఇంకా అనేక వివిధ ధార్మిక సందర్భాలలో పండుగలు జరుగుతాయి. ఇది ఉపన్యాసాలు, కీర్తనలు-ధార్మిక శ్లోకాలు, జాగరణలు, భజన్ సంధ్యలు- సాయంత్రం పూట సగీత కచేరీలు, ఇతర ధార్మిక, వినోద కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుంది. ఈ పండుగ సమయంలో ప్రాముఖ్యత గల కళాకారులను, పాటలు పాడేవారిణి వారి ప్రతిభను ప్రదర్శించడానికి ఆహ్వానిస్తారు.
బాబా అనుచరులలో భారతదేశంలో, విదేశాలలోని సాధారణ ప్రజలే కాకుండా, అన్ని రాజకీయ పార్టీల, సాంఘిక గ్రూపుల ప్రధాన లీడర్లు కూడా ఉన్నారు.