ఊంఛల్లి జలపాతాలను లషింగ్టన్ ఫాల్స్ అని కూడా పిలుస్తారు. ఇవి సిర్సికి 30 కి.మీ. దూరంలో సిద్దాపూర్ తాలూకాలో ఉన్నాయి. 1845 లో అప్పటి బ్రీటీష్ ప్రభుత్వ జిల్లా కలెక్టర్ జె.డి. లషింగ్టన్ ఈ జలపాతాలు కనిపెట్టాడు. కనుక దానికి ఆయనపేరు పెట్టారు. ఊంఛల్లి జలపాతాలను అక్కడి స్ధానికులు కెప్ప జోగ్ అంటారు. ఈ జలపాతం 381 అడుగుల ఎత్తునుండి పడుతుంది. ఈ జలపాతాలను సంవత్సరంలో ఏ సమయంలోఅయినా సరే చూడవచ్చు. ఇక్కడి పరిసరాలు పచ్చటి ప్రదేశాలు, నీటితో ఎత్తైన కొండల ఎత్తు పల్లాలతో ఆహ్లాదంగా ఉంటాయి.