షోలాపూర్ పరిసరాలలో భుయికోట్ కోట ఒక ప్రధాన ఆకర్షణ. క్రీ.శ. 14 వ శతాబ్దంలో మధ్య యుగంలో బహమనీ వంశ పాలనలోనే దీనిని కట్టారు. ఈ కోట లో ఔరంగజేబు కొంత సమయం గడిపాడనడానికి చారిత్రిక ఆధారాలు ఉన్నాయి. రెండో పీష్వా బాజీరావు నకు ఈ కోట ను అప్పగించిన తర్వాత అతను ఇక్కడే నివసించాడు.బాతులు, నెమళ్ళు, కుందేళ్ళు, కోతులు, ఇంకా అనేక జంతువులు కల్గిన జంతువుల పార్క్ కల్గిన ప్రాంతంగా ఈ కోట ప్రసిద్ధి చెందింది. ఇక్కడ పుష్కలంగా ఉన్న వినోద సౌకర్యాలతో పిల్లలు ఎంతో ఆనందపడతారు.ఈ ప్రాంతం మీ కుటుంబ సభ్యులతో ఇక్కడి మనోహర దృశ్యాలను చూడడానికి లేదా ఇక్కడ తిరిగే కుందేళ్ళను తిలకించుటకు ఎంతో ఉత్తమమైనదిఅష్టభుజ ఆకారంలో ఉండి భుయికోట్ కోట కాలానికే చెందిన బావి ఒకటి ఇక్కడ ఉంది.