సొంభద్ర ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోరెందవ అతి పెద్ద జిల్లా. ఇది వింధ్య పర్వత శ్రేణుల కు ఆగ్నేయంగా వుంది. ఈప్రాంతం తూర్పు నుండి పడమటికి ప్రవహించే సోనే రివర్ కలిగి వుంది. సొంభద్ర పర్యాటన అనేక చారిత్రక మరియు సాంస్కృతిక అంశాలు తెలియ చేస్తుంది. ఇక్కడ అనేక పురాతన స్మారకాలు, కోటలు, భవనాలు కలవు.
సొంభద్ర లోను చుట్టుపట్ల కల ఆకర్షణలు
సొంభద్రలో కల విజ్ఞాన్ కోట 5 వ శతాబ్దం నాటిది. దీనిని కోలి రాజులూ నిర్మించారు. దీనిలో అనేక గుహ పెయింటింగ్ లు, శాసనాలు కలవు. మరొక కోట నౌఘర్ కోట దీనిని కాశి రాజులు కట్టించారు. ఇపుడు ఇది ప్రభుత్వ గెస్ట్ హౌస్ గా మార్చారు. మరొక అగోరి కోట అందమైనది. దీనికి మూడు పక్కలా మూడు నదులు ప్రవహిస్తాయి.
సొంభద్రలో ఒక సల్ఖాన్ ఫాస్సిల్ పార్క్ కలదు. ఇక్కడ కల సిలాజలాలు సుమారు 1400 మిలియన్ ఏళ్ల నాటివిగా చెపుతారు. ఇంకా,ఇక్కడ ముక్తా జలపాతాలు కలవు. ఇక్కడ నేక అనేక గుహల పెయింటింగ్ లు కలవు. లఖారియ గుహలు కైమూర్ శ్రేణులులో కలవు. వీటిలో అందమైన రాక్ పెయింటింగ్ లు అనేకం కలవు. ఈ చారిత్రాత్మక పెయింటింగ్ లు సుమారు 4000 సంవత్సరాల నాటివి. ఖొదవ పహార్ లేదా ఘోర మంగార్ మరొక పురాతన గుహ.
ఈప్రాంతంలో రెండు డాములు కలావు. ఆవి రిహంద్ డాం మరియు బర్కందార డాం. అతి పెద్దైన లోరిక రాక్ కూడా చూడవచ్చు. ఇక మతపర ప్రదేశాలు పరిసీలిస్తే, శివ ద్వార్ ఒక ప్రఖ్యాత టెంపుల్. దీని నిర్మాణంలో 11వ శతాబ్దం నాటి నల్ల రాతి విగ్రహాలు కలవు. సొంభద్ర పర్యటన ప్రకృతి ప్రియులకు, కళా ప్రియులకు అద్భుతంగా వుంటుంది.
సొంభద్ర సందర్శనకు ఉత్తమ సమయం
సొంభద్ర సందర్శనకు నవంబర్ నుండి మార్చ్ వరకు ఉత్తమ సమయం.
సొంభద్ర ఎలా చేరాలి ?
సొంభద్ర ను వాయు, రైలు, రోడ్డు మార్గాలలో చేరావచ్చు.
వాతావరణం
ఉత్తర భారత దేశం లోని ఇతర నగరాలవలె సొంభద్ర లో కూడా వేసవులు, శీతాకాలాలు ,వర్షా కాలాలు వుంటాయి.