ఇది కి, కే మరియు కీ మఠం గా కూడా పిలవబడుతుంది. సముద్ర మట్టానికి 4116 మీటర్ల ఎత్తులో ఉన్న కై మఠం , స్పితి అంతర్భాగానికి ప్రధాన కేంద్రంగా ఉన్న కాజా నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గొంప, పొట్టి గదులు మరియు ఇరుకైన వసారాలతో క్రమరహిత ఆకారంలో ఉంటుంది. ప్రార్థన గదులు, ఇరుకైన నడవాలు, మెలికల మెట్లు, మరియు చిన్న తలుపులు ద్వారా అనుసంధానించబడి, అస్తవ్యస్తంగా ఉంటాయి.
ఆరామం యొక్క నిర్మాణ శైలి 'పాసాదా' రకం నమూనాను సూచిస్తుంది. ఈ విహారం, అద్భుతమైన కుడ్యచిత్రాలు, థంకాలు, అరుదైన రాతప్రతులు, గార చిత్రాలు మరియు వాయు వాయిద్యాలకు ప్రసిద్ధిచెందింది. గొంపలో దోపిడీదారులను అడ్డుకునేందుకుగా, కథానుసారం, భావించబడే, పాత ఆయుధాల భారీ సేకరణ కూడా ఉంది. వందల మంది లామాలు మత శిక్షణ కొరకు రావటం, ఈ మఠం యొక్క మరొక ముఖ్య విశేషం.