ఈ యాత్రా స్ధలం హొయసల రాజు రెండవ బల్లాల కు బ్రాహ్మణ మంత్రి చంద్రమౌళి భార్య అచ్చియక్కచే 1121 లో నిర్మించబడిది. దీనిని సోప్ స్టోన్ తో నిర్మించారు. ఈ నిర్మాణంలో హొయసలుల శిల్పకళా నైపుణ్యం కనపడుతుంది. అక్కనబసాడి దేవాలయ ప్రధాన ఆకర్షణ అంటే ఈ మందిరంలో 5 అడుగుల ఎత్తుగల పార్శనాధుడి విగ్రహం ఉంటుంది. ఇంతే కాక, ఈ దేవాలయం గర్భగ్రిహం, సుకనాసి, గోపురం, సభా మంటపం కలిగి ఉంటుంది. దేవాలయం చేరగానే భక్తులు ఎంతో అందంగా చెక్కిన దేవతామూర్తుల విగ్రహాలను, యక్ష ధరనేంద్ర, యక్ష పద్మావతి మొదలైన విగ్రహాలను దర్శిస్తారు.