17 మీటర్లు అంటే సుమారు 58 అడుగుల ఎత్తుగల గోమతేశ్వర విగ్రహం పట్టణంలో ప్రధాన ఆకర్షణ. ఈ విగ్రహాన్ని గంగా సామ్రాజ్య రాజు రాజమల్ల మరియు ఆయన ప్రధాని చాముండరాయ నిర్మించారు. ఈ ప్రదేశంలో పర్యాటకులు కన్నడ, తమిళ భాషలలో వ్రాసిన శిలా శాసనాలు చూడవచ్చు. వీటిలో గోమతేశ్వర విగ్రహాన్ని నిర్మించిన రాజు, మంత్రిలపై అనేక ప్రశంసలు కూడా ఉంటాయి.
వేలాది భక్తులు, ప్రత్యేకించి జైనులు ప్రతి సంవత్సరం జరిగే మహా మస్తాభిషేక పండుగకు వేలాదిగా తరలి వస్తారు. ఈ ఉత్సవం 12 సంవత్సరాలకొకసారి జరుగుతుంది. గోమతేశ్వరుడికి పాలు, పెరుగు, బంగారు నాణేలు, నెయ్యి, కుంకుమపూవు, మరి కొన్ని వస్తువులతో అభిషేకం చేస్తారు.