శృంగేరి చూడాలనుకునేవారు ఆది శంకరుల దేవాలయం తప్పక చూడాలి. ఈ దేవాలయంలో ఆది శంకరాచార్య విగ్రహం ఉంటుంది. ఈయన అద్వైత సిద్ధాంతాలను ప్రచారం చేశారు. ఈ జగద్గురువు విగ్రహం రెండు అడుగుల ఎత్తున ఒక పీఠం పై స్ధాపించారు. ఈ విగ్రహం యోగాసనం భంగిమలో ఉంటుంది. సరిగ్గా లింగం ముందు ప్రతిష్ట చేశారు. దేవాలయ పరిసరాలలో టూరిస్టులు శంకరాచార్యులను అనుసరించినవారి నాలుగు విగ్రహాలు చూస్తారు. పంచామృత అభిషేకం, అర్చన, రుద్ర అభిషేకం వంటివి నిత్యం ఈ దేవాలయంలో జరుగుతాయి. యాత్రికులు ఈ దేవాలయాన్ని ఉదయం 7 గం. నుండి 1 గం. వరకు సా. 5 గం. నుండి 8.30 గం. వరకు చూడవచ్చు.