శృంగేరి మఠానికి పడమటి భాగంలో కరే ఆంజనేయ దేవాలయం ఉంటుంది. దీనిని ఆది శంకరాచార్యులు స్ధాపించారు. 27 మెట్లు ఎక్కి ఈ దేవాలయం చేరాలి. ఈ దేవాలయం చేరగానే యాత్రికులు పెద్ద హనుమాన్ విగ్రహాన్ని ,శివుడిని, గణేష విగ్రహాన్నిచూస్తారు. ఈ ఆంజనేయవిగ్రహం తన కూడి చేతితో ఆశీర్వాదాలు అందజేస్తుంది. మరో చేతిలో కమలం ఉంటుంది. భక్తులు అధిక సమయం ఇక్కడ ధ్యానం చేయవచ్చు. ఇక్కడ ప్రధాన వేడుక అంటే దీపోత్సవం. దీనిని కార్తీక క్రిష్ణపక్ష నెలలో శనివారాలు చేస్తారు.