శృంగేరిలో శారదా దేవి దేవాలయం కూడా తప్పక చూడాలి. దీనినే శారదాంబ దేవాలయం అని కూడా అంటారు. ఈ దేవత, జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఈ పీఠాన్ని ఆచర్య శ్రీ శంకర భగవత్పాద 7వ శతాబ్దంలో స్ధాపించారు. ఇతిహాసాల మేరకు 14వ శతాబ్దంలో పురాతన గంధపు చెక్క విగ్రహం స్ధానంలో బంగారు మరియు రాతి విగ్రహాన్ని పెట్టారు. ఇక్కడే ఒక లింగం కూడా ఉంటుంది. దీనిని శివుడు శంకరాచార్యులవారికి ప్రసాదించినట్లు చెపుతారు. అగ్నిప్రమాద కారణంగా దేవాలయం శిధిలమైందని తర్వాతి కాలంలో అది దక్షిణ శిల్ప శైలిలో నిర్మించారని చెపుతారు. ఇక్కడ ఒక మహా మండపం ఉంది. దీనిలో ద్వారపాలకులు, మాత దుర్గాదేవి మరియు మాత రాజ రాజేశ్వరి ఉంటారు. పర్యాటకులు అష్టలక్ష్మీ చిత్రాలను ఎనిమిదింటిని ద్వారాలపై బంగారు పూతలతో దర్శించవచ్చు. తమిళనాడు సాంప్రదాయ రీతిలో శిల్ప శాస్త్రాలను అనుసరించి ఈ దేవాలయ శిల్పాలు చెక్కినట్లు తెలుస్తోంది. ఈ దేవాలయంలో నవరాత్రి మరియు చైత్ర శుక్ల పూర్ణిమ లకు వేడుకలు ఘనంగా జరుగుతాయి. కార్తీక పౌర్ణమికి దీపోత్సవం, లలితా పంచమి మాఘశుక్ల పంచమి మరియు శారదాంబ రధోత్సవాన్ని మాఘ తదియనాడు జరుపుతారు. పర్యాటకులు దేవాలయానికి నైరుతి దిశలో కల శక్తి గణపతిని కూడా దర్శించవచ్చు.