ఈ చారిత్రక కట్టడాన్ని 1784 లో నిర్మించారు. దీనినే టిప్పు సుల్తాన్ వేసవి విడిది అని కూడా అంటారు. ఈ నిర్మాణాన్ని హైదర్ ఆలి మొదలు పెడితే అతని కుమారుడు టిప్పు సుల్తాన్ పూర్తి చేశారు. పర్యాటకులు తప్పక చూడవలసిన ప్రదేశంగా గుర్తింపు పొందిన దీనిని ఒక జాతీయ చారిత్రాత్మక కట్టడంగా 1959 లో గుర్తించారు. శ్రీరంగ పట్నం దర్శించే యాత్రికులంతా దీనిని తప్పక చూస్తారు. దరియా దౌలత్ బాగ్ నిర్మాణంలో భారతీయ మరియు ముస్లిం శిల్ప కళా శైలి కనపడుతుంది. పర్యాటకులు, వివిధ రకాల చిత్రాలను, టిప్పు సుల్తాన్ ధరించిన దుస్తులను మొదలైన వాటిని మొదటి అంతస్తులో చూస్తారు. అంతేకాక కుడ్య చిత్రాలలో టిప్పు సుల్తాన్ బ్రిటీష్ వారితో పోరాడిన సంఘటనలు కూడా భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో చూడవచ్చు.