జమా మసీదునే అందరూ సాధారణంగా మసీద్ ఎ అలా అని కూడా అంటారు. శ్రీరంగపట్నంలో ఉన్న దీనిని తప్పక చూడాలి. ఈ మసీదును టిపు సుల్తాన్ 1784 సంవత్సరంలో తాను మైసూర్ రాజ్యాన్ని గెలుపొందిన తర్వాత నిర్మించాడు. టిప్పు సుల్తాన్ తన మొదటి ప్రార్ధన ఈ మసీదులో చేసినట్లు చెపుతారు. ఈ చారిత్రక నిర్మాణాన్ని టిప్పు సుల్తాన్ అమితంగా ఇష్టపడేవాడు. ఈ మసీదులో రెండు అంతస్తులు ఉంటాయి. అరుదైన చిన్న డోమ్ తెలుపు రంగులో ఉంటుంది. పెద్ద గోపురాలు, రెండు మినరెట్లు ఉంటాయి. ఈ మసీదులో టిక్ టిక్ అనే గడియారం ఉంటుంది అది 97 సంవత్సరాల నాటిది. అయినా పని చేస్తూనే ఉంటుంది. పడమటి వైపు, వరండాలో ఒక ప్రార్ధనా మందిరం ఉంటుంది.
ముందు భాగం ఓపెన్ గా ఉంటుంది. మసీదు ఎత్తు ప్రదేశంపై కట్టబడింది. ఈ మసీదు మినారెట్లనుండి 200 మెట్లు ఎక్కితే చాలు చుట్టుపక్కల ప్రదేశాలు బాగా కనపడతాయి. మరణించిన అబ్దుల్ హఫీజ్ జునాయిడి ఈ మసీదులో మత గురువుగా ఉండేవాడు. సుమారు 50 సంవత్సరాలపాటు ప్రార్ధనలు నిర్వహించాడు. అల్లాకుగల 99 పేర్లను చెక్కిన ఒక రాతి పలకను కూడా పర్యాటకులు చూడవచ్చు. మదరాస అనే ఒక మతపర సంస్ధ ఈ మసీదు ఆవరణలో ఉంది.