శ్రీరంగపట్న పర్యాటకులు మహదేవపుర తప్పక చూడాలి. ఇది ఒక అందమైన విహార స్ధలం. చిన్న గ్రామం. కావేరి నది దట్టమైన అడవిగుండా ఇక్కడ ప్రవహిస్తుంది. పర్యాటకులు గెండే హొసల్లి బర్డ్ శాంక్చురీని కూడా ఈ గ్రామంలో చూడవచ్చు. ఇక్కడ 600 సంవత్సరాలనాటి శివ దేవాలయం కలదు. పరిసర ప్రదేశాలైన మైసూర్, బెంగుళూరు, మాంధ్య లనుండి వారాంతపు సెలవులలో పిక్ నిక్ గా ప్రజలు వస్తారు.