శ్రీరంగ పట్న పర్యాటకులు పాండవపుర తప్పక చూడాలి. ఇది రెండు కొండలమధ్య రాల్ళతో నిర్మించబడింది. ఈ పట్టణం లో పాండవులు కొంతకాలం నివసించటంచే దీనికి ఈ పేరు వచ్చింది. వారి తల్లి కుంతి ఈ ప్రదేశాన్ని బాగా ఇష్టపడేదని చెపుతారు. ఈ పట్టణాన్ని ఫ్రెంచి రాక్స్ అని పిలిచేవారు.
స్వాతంత్రానికి ముందర ఫ్రెంచి వారు బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా టిప్పు సుల్తాన్ కు సహయం చేసేందుకు ఇక్కడకు రావటంతో ఈ పేరు వచ్చింది. ఈ ప్రాంతంలో అందమైన వరి, చెరకు పొలాలున్నాయి. ఇక్కడి ప్రజలకు వ్యవసాయం ఆధారం. పర్యాటకులు అనేక వ్యవసాయ, ఆయుర్వేద ఉత్పత్తులను, చేతి కళల వస్తువులను కూడా కొనుగోలు చేయవచ్చు.