ఈ దేవాలయాన్ని 9వ శతాబ్దంలో గంగ రాజులు నిర్మించారు. విజయనగర మరియు హొయసల పాలకులు నిర్మించిన దేవాలయాలలో ఇది అతి పెద్దదిగా చెప్పబడుతుంది. దీనిలో శ్రీ మహా విష్ణువు అవతారమైన రంగనాధస్వామి దర్శనమిస్తాడు. ఈ పుణ్య క్షేత్రం పంచరంగ క్షేత్రాలలో ఒకటిగా చెపుతారు. గర్భగుడిలో రంగనాధుడు చిరునవ్వులు చిందిస్తూ పవళింపు సేవలో దర్శనమిస్తాడు. ఈ విగ్రహాన్ని నల్లని రాతితో చెక్కారు. అనంత అనే పాముపై పవళించి ఉంటాడు. శ్రీ మహా విష్ణవు 24 అవతారాలు అందమైన స్తంభాలపై గుడి చుట్టూ ప్రదర్శించారు.
ఈ దేవాలయ లోపలి గోడలు కూడా శ్రీనివాసుడు, పంచముఖ ఆంజనేయుడి బొమ్మలతో చెక్కబడి ఉంటాయి. కర్నాటకలోని పెద్ద దేవాలయాలలో ఇది ఒకటిగా చెప్పబడుతూంది. దీని మహద్వారం ఒక పెద్ద టవర్ గా ఉండి స్తంభాల హాలు ఉంటుంది. దీనిని మూడు నుండి నాలుగు దశలలో నిర్మించారు. పర్యాటకులు ఈ దేవాలయాన్ని సంక్రాంతి పండుగకు సందర్శించవచ్చు. అపుడు ఇక్కడ లక్షదీపాలు వెలిగించి లక్షదీపోత్సవం చేస్తారు. ఈ దేవాలయం సంవత్సరమంతా తెరచి ఉంటుంది. పూజ సమయాలు ఉదయం 8 నుండి 9.30 గం. లుగాను రాత్రి 7 నుండి 8 గం.లుగాను ఉంటాయి.