శ్రీరంగపట్నం వచ్చే పర్యాటకులు శ్రీరంగపట్నం కోటను తప్పక సందర్శించాలి. ఈ కోట కావేరీ నది మధ్యన ఒక ద్వీపంలో నిర్మించబడింది. దీనినే టిప్పు సుల్తాన్ ఫోర్ట్ అని అంటారు. దీనిలో భారతీయ ముస్లిం శిల్ప శైలి కనపడుతుంది. దీనికి నాలుగు ప్రవేశ ద్వారాలు ఉంటాయి. వీటికి ఢిల్లీ, బెంగుళూర్, మైసూర్ మరియు నీరు మరియు ఏనుగు అని పేర్లు. భధ్రత కొరకు రెండు గోడల భధ్రతా విధానాన్ని కూడా ఆచరించారు.
కోటకు ప్రత్యేక ఆకర్షణ అంటే అది ప్రవేశ ద్వారం. దీనిపై పర్షియా భాషలో స్ధాపన తేదీని వ్రాశారు. బ్రిటీష్ పాలకుడు సర్ రాబర్ట్ కెర్ శ్రీరంగపట్నంపై దాడి చేస్తున్న సంఘటనలను అందమైన పెయింటింగ్ లు గా కోట గోడలపై చిత్రీకరించారు. ఈ నిర్మాణంపై శ్రీ మహా విష్ణువు 24 వివిధ అవతారాలను కూడా చెక్కారు. కోట కింది భాగాలను బ్రిటీష్ అధికార్లు జైళ్ళుగా వాడేవారు. కోట లోపల శ్రీరంగనాధ స్వామి దేవాలయం మరియు ఒక మసీదు కూడా ఉంటాయి.