అక్క మహాదేవి గుహలు నల్లమలై శ్రేణులలోని కొండలపై శ్రీశైలం కు సుమారు 10 కి. మీ. ల దూరం లో కలవు. ఈ గుహలు చరిత్రకు పూర్వం నాటివని తెలియజేసే ఆధారాలు కూడా కలవు. పట్టణ చరిత్రలో ఈ గుహలు ఎంతో ప్రాధాన్యత వహిస్తాయి. ఈ గుహలకు 12 వ శతాబ్దపు వేదాంతి మరియు కర్ణాటక గాయని అయిన అక్కమహాదేవి అక్కడ గుహల లోపలి భాగాలలో కల సహజ శివలింగం కు తపము , పూజలు చేయుట వలన ఆమె పేరు పెట్టారు.
అక్క మహాదేవి గుహలు సహజంగా ఏర్పడిన గుహలు. కృష్ణా నది కి ఎగువ భాగంలో కలవు. ప్రధాన గుహకు సహజంగా ఏర్పడిన ఒక అద్భుత ఆర్చ్ వుంటుంది. ఈ ఆర్చ్ కొలతలు సుమారుగా 200 x 16 x 4 గా వుండి ఎట్టి ఆధారం లేక వుంటాయి. పర్యాటకులు గుహలలోని భాగాలకంటే కూడా ఈ ఆర్చ్ సహజ నిర్మాణానికి ఆనందిస్తారు. ఈ గుహల లో కల రాళ్ళు ఎపుడో భూమి పుట్టిన నాటివి, పురాతనమైనవి కనుక ఒక మంచి ఆకర్షణగా వుంటాయి.
ఈ గుహలకు కృష్ణా నది గుండా వెళ్ళడం ఒక మంచి అనుభవం. సుమారు 150 అడుగుల పొడవు వుండే ఈ గుహల సందర్శన మరింత మంచి అనుభవం గా కూడా వుంటుంది.