మల్లెల తీర్థం ఒక జలపాతం. శ్రీశైలం పట్టణానికి ఇది సుమారు 50 కి. మీ. ల దూరం లో కలదు. ఈ నీరు ఎంతో పవిత్రమైనదని భావించటం తో భక్తులు ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో వచ్చి స్నానాలు చేస్తారు. ఈ జలపాతాలు దట్టమైన అడవుల మధ్యన ఉన్నప్పటికీ రోడ్ మార్గం లో తేలికగా ప్రయాణించవచ్చు. వర్షాకాలం లో మాత్రం రోడ్ సరిగ్గా వుండదు.
ఈ మల్లెల తీర్థం లో స్నానాలు చేస్తే పాపాలు పోతాయని మోక్షం దొరుకుతుందని భావించటం తో ఈ జలపాతాలు ప్రాముఖ్యతని సంతరించుకొన్నాయి. అయితే, ఈ నీటిలోకి చేరాలంటే సుమారు 250 మెట్లు దిగి వెళ్ళాలి కనుక, చాల జాగ్రత తీసుకోవాలి. జారి పడే అవకాశం వుంటుంది. వేగిర పడకుండా నిదానంగా మెట్లు దిగి వెళ్ళాలి.