టాబో మఠం సముదాయంలోని ప్రసిద్ద దేవాలయాల్లో ఒకటైన స్వర్ణ దేవాలయానికి ఒక ఇతిహాసం నుంచి ఈ పేరు వచ్చింది. అసలు స్వచ్చమైన బంగారంతో నిర్మించిన ఈ దేవాలయానికి సేన్గ్గే నామ్గ్యాల్ అనే లడఖ్ రాజు 16 వ శతాబ్దంలో మార్పులు, చేర్పులూ చేసాడని చెప్తారు. ఈ గోడలు, పైకప్పుల మీద వున్న కుడ్య చిత్రాలకు ఈ ప్రాంతం ప్రసిద్ది చెందింది.