కొడగు జిల్లాలో విరాజ్ పేట ఒక పట్టణం. స్ధానికంగా ఉత్పత్తి అయ్యే కాఫీ మరియు సుగంధ ద్రవ్యాలకు ప్రసిద్ధి. ఇక్కడకల అయ్యప్ప దేవాలయం పర్యాటకులకు ఎంతో ఆకర్షణ. హిందువులు ఈ దేవాలయాన్ని ఎంతో పవిత్రమైనదిగా ఆరాధిస్తారు. సంవత్సరం పొడవునా యాత్రికులు ఈ దేవాలయాన్ని సందర్శిస్తూనే ఉంటారు. మలేధిరికే కొండ అగ్రభాగాన ఉన్న ఈ దేవాలయం సందర్శకులకు విరాజ్ పేట పట్టణాన్ని కన్నుల పండువగా చూపుతుంది. పట్టణం నుండి సుమారు 8 కి.మీ.ల దూరంలో గల కాకోతుపరంబు ప్రదేశంలోని కొండ విరాజ్ పేట సందర్శకులకు మరో ఆకర్షణ. ఇక్కడే కల సెయింట్ ఆన్స్ చర్చి మరో ప్రధాన ఆకర్షణ. ఈ చర్చిని ఫాదర్ గుల్లివాన్ సుమారు 200 సంవత్సరాల క్రిందట గోధిక్ శిల్పశైలిలో నిర్మించారు. నగరం మధ్యలో కల క్లాక్ టవర్ పర్యాటకులను ఆకర్షిస్తుంది. సమీపంలోని ఒక గణేశ దేవాలయంకూడా మరో ఆకర్షణ. తడియాండమోల్ సందర్శకులు విరాజ్ పేట తప్పక చూడాలి.