కావేరి నది ఒడ్డునగల సోమనాధపుర గ్రామంలో ఈ దేవాలయం ఉంది. దీనిలో వేణుగోపాలస్వామి మరియు చెన్నకేశవ స్వామి ఆలయాలుంటాయి. 1296లో హోయసల రాజు నరసింగ వేణుగోపాల స్వామి దేవాలయాన్ని, నిర్మించగా చెన్నకేశవ దేవాలయాన్ని 1268 లో హొయసల జనరల్ సోమనాధ్ నిర్మిస్తాడు.దేవాలయంలో గోడలపై వివిధ దేవతలు, జంతువుల బొమ్మలు హొయసల కళా నైపుణ్యంతో చెక్కబడ్డాయి. ఒక పెద్ద మండపం 64 గదులతో నిర్మించారు.